AP News: జగన్ నమ్మించి మోసం చేశారు.. మీ భవిష్యత్కి టీడీపీ గ్యారంటీ: కందికుంట వెంకటప్రసాద్ కదిరిలోని 35 వార్డు కుమ్మరివాళ్ళపల్లిలో టీడీపీ ఇన్చార్జి కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి బాబు గ్యారెంటీ భవిష్యత్కు గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. By Vijaya Nimma 05 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Babu Guarantee program: బాబు గ్యారెంటీ ఇది భవిష్యత్తుకు గ్యారంటీ టీడీపీ మేనిఫెస్టో పథకాలను ఇంటింటికి వెళ్లి మహిళలకు వెంకటప్రసాద్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు కందికుంట వెంకటప్రసాద్. బాబు గ్యారెంటీ ఇది భవిష్యత్తు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మహిళలతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అమ్మ ఒడి పేరుతో కుటుంబంలోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని తల్లి, భార్య, చెల్లి ద్వారా ప్రజలను నమ్మించి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ద్రోహం చేయడం నిజం కాదా..? అధికారంలోకి రాగానే కుటుంబంలోని చదువుకునే ఒక బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి వర్తిస్తుందని మెలిక పెట్టి పేద ప్రజలకు జగన్ ప్రభుత్వం ద్రోహం చేయడం నిజం కాదా..? అంటూ కందికుంట వెంకటప్రసాద్ ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి చేసిన మోసకారితనాన్ని ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళా శక్తి పేరుతో సూపర్ సిక్స్ అని పథకాలను ప్రవేశపెట్టి ఏ విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రజలకు వివరించారు కందికుంట వెంకటప్రసాద్ . తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ తరహా ప్రత్యేక చట్టం చేస్తామని కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని టీడీపీ నేతలు పిలుపు దళితులను నిరక్ష్యం చేసిన సీఎం జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. జగన్, వైసీపీ నేతలు దళితులపై సాగిస్తున్న దమనకాండను ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. దళితులపై దాడులు ఆగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. వైసీపీ పాలన భవిష్యత్ తరాలు కూడా పూర్తిగా నాశనం చేసేలా కొనసాగుతుందని వెంకటప్రసాద్ అన్నారు . మాజీ సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఇది కూడా చదవండి: దోపిడీ దొంగల ఆట కట్టించిన తిరుపతి పోలీసులు..అభినందించిన ఎస్పీ #tdp-in-charge-kandikunta-venkataprasad #anantapur #campaign-program #babu-guarantee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి