అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభోత్సవం జరగనుందని రామందిరం ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. జనవరి 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొంది. సాధువులు, ప్రముఖులను కూడా ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. రామమందిరం ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని.. అన్ని పార్టీల రాజకీయ నేతలను కూడా ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. అతిథులు ఎవరంటే?
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీని ఈ వేడుకకు ఆహ్వానించినట్లు పేర్కొంది.
Translate this News: