Tillu Square Collections: టిల్లు స్క్వేర్..బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. గతవారం రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ రూ. 100 కోట్లకు చేరువలో ఉంది.

Bhoomi
మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. 26మంది సైనికులకు గాయాలయ్యాయి.
Assam CM Himanta Biswa Sarma Dance: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ డ్యాన్స్ తో అదరగొట్టారు. శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హిమాంత బిశ్వశర్మ ప్రచారం నిర్వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలు జీవితం అనుభవిస్తున్న ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాకు షాక్ ఇచ్చింది కోర్టు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని..జైలు నుంచి రిలీజ్ అవుతానని పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.ఆయన కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
DC vs KKR : సిక్సర్ల వర్షంతో విశాఖ స్టేడియం తడిసి ముద్దయ్యింది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు సుడిగాలి ఇన్నింగ్స్ తో చెలరేగి ఆడారు. ఓపెనర్ సునీన్ నరైన్ అర్థ సెంచరీతో చెలరేగాడు. అంగ్ క్రిష్ రాఘువంశీ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్లోనూ పని చేయగలరు.. దేశ రూపురేఖలనీ మర్చగలరు.. ఏ పదవిలో పనిచేసినా దానికి వన్నే తీసుకురాగలరు.. ఎన్నికల్లో పోటీ చేయకుండా 33 ఏళ్లు ఎంపీగా ఉన్న నేత ఆయన.. అయితే తాజాగా ఆయన పదవీకాలానికి ఎండ్కార్డ్ పడింది.
Mukesh Ambani : భారతదేశంతోపాటు ఆసియాలోనే కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్ధానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024లో 200 మంది భారతీయులు ఉన్నారు.
వాటర్ ట్యాంకులో పడి 30కోతులు మృతి చెందిన సంఘటన నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో చోటుచేసుకుంది. విజయ విహార్ సమీపంలో ఉన్న 200 ఇళ్లకు మంచినీరు సరఫరా చేసేందుకు ట్యాంకు నిర్మించారు. ట్యాంకులో నీళ్లు తాగేందుకు ప్రయత్నించిన వానరాలు అందులో పడి మరణించాయి.
వ్యవసాయ బావి తవ్వుతుండగా ఇద్దరు వ్యక్తులో మట్టిలో చిక్కుకుపోయారు. నరకయాతన అనుభవించి మృత్యువు అంచుకు వరకు వెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు గంటల శ్రమించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పర్వదినం. ప్రతిపద తిథి ప్రకారం, హిందూ నూతన సంవత్సర రాజు చంద్రుడు, మంత్రి శని.రాబోయే సంవత్సరం 5 రాశుల వారికి చాలా ఫలవంతంగా ఉంటుంది. హిందూ నూతన సంవత్సరం ప్రకారం, మేషంతో సహా 5 రాశుల వారు సంపద, ఆర్థిక లాభం పురోగతిని పొందుతారు.
Advertisment
తాజా కథనాలు