జిరిబామ్ జిల్లాకు కాన్వాయ్ వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.ఈ దాడిలో ఒక భద్రతా సిబ్బంది గాయపడ్డారు.ముఖ్యమంత్రి కాన్వాయ్పై పలుసార్లు తుపాకీ కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ప్రతీ కాల్పులు జరిపారు. జాతీయ రహదారి-53లోని ఒక భాగం వెంబడి కోట్లెన్ గ్రామం సమీపంలో ఇప్పటికీ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. “ఢిల్లీ నుంచి ఇంఫాల్ చేరుకోని సిఎం బీరెన్ సింగ్.. జిల్లాలో పరిస్థితిని సమీక్షించడానికి జిరిబామ్ను వెళ్లినట్లు” ఒక అధికారి తెలిపారు. ఈ మధ్యే అనుమానిత ఉగ్రవాదులు జిరిబామ్ జిల్లాలో రెండు పోలీసు అవుట్పోస్టులు, అటవీ బీట్ కార్యాలయం, 70 ఇళ్లను తగులబెట్టారు.
పూర్తిగా చదవండి..మణిపూర్ సీఎం కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడి..!
సోమవారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాంగ్పోక్పి జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో భద్రతా వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో కాన్వాయ్ డ్రైవర్ కుడి భుజానికి బుల్లెట్ గాయమైవగా అతనిని ఆసుపత్రికి తరలించారు.
Translate this News: