Nalgonda: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి

చలో నల్గొండ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. వారు వెళ్తున్న బస్సుపై కొందరు కోడి గుడ్లతో దాడి చేశారు. నల్ల దుస్తులు ధరించి కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
Nalgonda: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి

Attack On BRS MLA : కృష్ణా జలాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో నల్గొండ సభకు (Nalgonda Meeting) వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. వారు వెళ్తున్న బస్సును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బస్సుపై కోడి గుడ్లతో దాడికి దిగారు. గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేపట్టారు. నల్లగొండ మనోరమ హోటల్‌ దగ్గర.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో... ఎమ్మెల్యేల బస్సును NSUI కార్యకర్తలు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపులో ఉంచేందుకు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ బృందం..

Advertisment
Advertisment
తాజా కథనాలు