MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై మరోసారి అటాక్ జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసంపై దుండగులు దాడి చేశారు. ఓవైసీ ఇంటిపై బ్లాక్ ఇంక్తో పాటు పోస్టర్లు అంటించారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై ఆయన పేరు కనిపించకుండా బ్లాక్ ఇంక్ పూశారు. భారత్ మాతాకీ జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటూ పోస్టర్లు అంటించారు. లోక్సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా అసదుద్దీన్ ‘జై పాలస్తీనా’ అనడంపై దుమారానికి కారణమైంది. పార్లమెంట్ సాక్షిగా మరో దేశం పేరు పలకడంపై బీజేపీ సహా పలు పార్టీలు భగ్గుమంటున్నాయి. ఓవైసీ వైఖరిని తప్పుబడుతూ దుండగులు ఇంటికి పోస్టర్లు అంటించారు. ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..Asad House Attack: ‘భారత్ మాతాకీ జై..’ ఒవైసీ ఇంటిపై మరోసారి అటాక్!
ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దుండగులు మరోసారి దాడి చేశారు. పార్లమెంట్లో ప్రమాణస్వీకారం తర్వాత ఒవైసీ జై పాలస్తీనా నినాదాలు చేసినందుకు వ్యతిరేకంగా కొందరు ఈ అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. భారత్ మాతాకీ జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటూ ఒవైసీ ఇంటిపై పోస్టర్లు అంటించారు.
Translate this News: