Kejriwal: నేను చనిపోతే.. దయచేసి ఇలా ఎవరూ చేయవద్దు.. కేజ్రీవాల్‌ ఎమోషనల్ కామెంట్స్.!

జూన్ 2వ తేదీన ఈడీ ఎదుట తాను సరెండర్ అవుతానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే..ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల పాటు జైల్‌లో ఉండడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందన్నారు.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

Kejriwal: జూన్ 2 మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసిపోతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. జూన్ 2వ తేదీన ఈడీ ఎదుట తాను సరెండర్ అవుతానని తెలిపారు. ఒకవేళ తాను దేశం కోసం చనిపోతే..ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల పాటు జైల్‌లో ఉండడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందన్నారు.

Also read: పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడ?.. కొనసాగుతున్న పోలీసుల వేట..!

తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని ఏ మాత్రం మర్చిపోనన్నారు. ఉచిత విద్యుత్, వైద్యం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం లాంటి హామీలు నెరవేర్చకుండా ఉండనని పేర్కొన్నారు. మీతో తాను లేకపోయినా సరే అన్ని పనులూ జరుగుతాయని వీడియోలో వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు