Arunachal Frontier Highway: దేశ ఈశాన్య సరిహద్దులో చైనా జోక్యం పెరుగుతోంది. దానికి చెక్ పెట్టేందుకు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రోడ్డు కనెక్టివిటీకి సంబంధించింది. దేశంలోని అతిపెద్ద-అత్యంత కష్టతరమైన ప్రాజెక్టులలో ఒకటైన అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ 6000 కోట్ల రూపాయలను కూడా కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. 11 రకాల ప్యాకేజీలకు ఈ కేటాయింపు జరిగింది. ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు, దానిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చైనా అభ్యంతరాలను పక్కన పెడుతూ ప్రాజెక్ట్(Arunachal Frontier Highway) పనులు మొదలు పెట్టేస్తోంది భారత్. ఈ హైవే ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం గురించి భారత్ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది.
పూర్తిగా చదవండి..Arunachal Frontier Highway: చైనాకు భారత్ షాక్.. వద్దంటున్నా ఆ పని కానిచ్చేస్తోంది..
చైనా అభ్యంతరాలను పక్కన పెడుతూ భారత్ ఈశాన్య సరిహద్దుల్లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు మొదలు పెడుతోంది. వీటిలో అత్యున్నత కష్టమైన, పెద్దదైన అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ నిర్మాణానికి సన్నాహాలు మొదలు పెట్టింది భారత్. దీనికోసం రూ.6000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం.
Translate this News: