CM Chandrababu : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కూటమితో పాటు వైసీపీ (YCP) సీరియస్ గా తీసుకుంది. తమ సిట్టింగ్ స్థానంలో విజయం సాధించి సత్తా చాటాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే.. కూటమి తరఫున టీడీపీ (TDP) ఇక్కడ పోటీ చేయడం ఖరారైనా.. అభ్యర్థి పేరు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దీంతో చంద్రబాబు వ్యూహం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆయన ఓ కమిటీని సైతం నియమించినట్లు సమాచారం.
AP Vizag MLC Elections : విశాఖ ఎమ్మెల్సీ ఉప పోరు.. చంద్రబాబు వ్యూహం ఏంటి?
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎల్లుండితో నామినేషన్ గడువు ముగియనుంది. వైసీపీ మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా ప్రకటించగా.. టీడీపీ మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో చంద్రబాబు వ్యూహం ఏంటనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.
Translate this News: