పవన్ కల్యాణ్కున్న మాస్ ఫాలోయింగ్ ఆయన సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాలపై జనసేన భారీస్థాయిలో ఆశలు పెట్టుకుంది. మొదటిసారి పవన్ కల్యాణ్ జూన్ 14న కత్తిపూడి నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు. అదే నెల 30న భీమవరం సభతో ముగించారు. గోదావరి ఉమ్మడి జిల్లాల్లో మొత్తం పది నియోజకవర్గాలను కవర్ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఆయన చేసిన విమర్శలు కలకలం రేపాయి. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అత్యంత అవినీతిపరుడని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఇదే సందర్భంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ద్వారంపూడికి మద్దతుగా నిలిచారు.
పూర్తిగా చదవండి..మూడో దఫా వారాహి యాత్ర ఎప్పుడు? అందరి చూపు పవన్ వైపు
జనసేనాని అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో రెండుసార్లు వారాహి యాత్ర చేపట్టి అధికార పార్టీ వైసీపీలో వణుకును పుట్టించారు. ఇప్పుడు ఏకంగా మూడో దఫా యాత్రకు రెడీ అవుతున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసైనికులతో సోమవారం (31-07-23) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆగస్టు 3 లేదా 7 తేదీల్లో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
Translate this News: