ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే!

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏపీపీఎస్సీ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డులో ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

New Update
ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే!

ఏపీ లోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏపీపీఎస్సీ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డులో ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 21 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాటికి కావల్సిన విద్యార్హతలు, వయసు, అనుభవం వంటి వాటి గురించి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 21 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

ఈ ఉద్యోగాలకు అప్లైయ్‌ చేయాలంటే అభ్యర్థులకు కనీసం 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉండవలెను. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 5 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ లకు 5 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది.

ఈ పోస్ట్‌లకు కావాల్సిన విద్యార్హతలు పలు విభాగాల్లో ఇంజనీర్‌ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి రూ. 45 వేల రూపాయల జీతం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు జనవరి 30 వ తేదీ నుంచి ఫిబ్రవరి 19 వరకు అప్లైయ్‌ చేసుకోవచ్చు.

ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. అప్లికేషన్‌ ని ఆన్‌ లైన్‌ విధానంలో పూరించాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించన పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించలేదు.

Also read: శబరిమల ఏర్పాట్లపై బీజేపీ, కాంగ్రెస్‌ ఫైర్‌..కనీసం నీరు కూడా ఇవ్వారా అంటూ..!

Advertisment
తాజా కథనాలు