Ap Crime: వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్పై దాడి జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఎన్నికల ప్రచార రథాన్ని దహనం చేశారు. రాజమండ్రిలోని వీఎల్పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్లోని ఆఫీస్ దగ్గర ఈ వాహనాన్ని ఉంచారు. దీనికి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భరత్ సమాచారం ఇచ్చారు. వెంటనే భరత్తో పాటు ఇన్స్పెక్టర్ కడలి సత్యనారాయణ, బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..Ap News: మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు… ఎవరి పని?
మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్పై దాడి జరిగింది. శుక్రవారం గుర్తుతెలియని దుండగులు ఎన్నికల ప్రచార రథాన్ని దహనం చేశారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమని, ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని భరత్ చెప్పారు.
Translate this News: