RTV Post Poll Study: ఏపీలో మెజార్టీ ఎంపీ సీట్లు ఆ పార్టీకే.. ఆర్టీవీ సంచలన రిపోర్ట్!

ఏపీ లోక్‌సభ పోలింగ్‌కు ముందు RTV స్టడీలో ఏం చెప్పామో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారు అయ్యాయో తేలింది. మా ప్రీ పోల్ స్టడీతో పోలిస్తే, పోస్ట్ పోల్ స్టడీలో వైసీపీకి ఒకటి తగ్గి, బీజేపీకి ఒక స్థానం పెరిగింది. ఓవరాల్‌గా టీడీపీ కూటమి 20 ఎంపీ సీట్లు గెలవబోతుంది.

RTV Post Poll Study: ఏపీలో మెజార్టీ ఎంపీ సీట్లు ఆ పార్టీకే.. ఆర్టీవీ సంచలన రిపోర్ట్!
New Update

AP Elections 2024: ఏపీ లోక్‌సభకు సంబంధించి పోలింగ్‌కు ముందు RTV స్టడీలో ఏం చెప్పామో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారు అయిందన్న వివరాల్లోకి వెళ్తే.. మా ప్రీ పోల్ స్టడీలో టీడీపీకి 13, జనసేనకి 2, బీజేపీకి 4 సీట్లు దక్కుతాయని చెప్పాం. ఓవరాల్‌గా కూటమి 19 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. వైసీపీ 6 స్థానాల్లో గెలుస్తుందని చెప్పాం. ఇక పోస్ట్ పోల్ స్టడీలో టీడీపీకి 13, జనసేనకి 2, బీజేపీకి 5 స్థానాలు వస్తాయని తేలింది. వైసీపీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుస్తుందని స్టడీలో తేలింది. అంటే మా ప్రీ పోల్ స్టడీతో పోలిస్తే, పోస్ట్ పోల్ స్టడీలో వైసీపీకి ఒక స్థానం తగ్గి, బీజేపీకి ఒక స్థానం పెరిగింది. ఓవరాల్‌గా టీడీపీ కూటమి 20 లోక్‌సభ స్థానాల్లో విజయకేతనం ఎగరేయబోతోంది. సెగ్మెంట్ల వారీగా పూర్తి వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

#ap-election-2024 #rtv-study-reports
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe