AP Politics: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?

ఏపీలో పది మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. కడప నుంచి షర్మిలా పోటి చేయడం కన్ఫామ్‌ అయ్యింది. అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల- జేడీ శీలం, కాకినాడ-పళ్ళంరాజు, విశాఖ-సత్యారెడ్డి, అనకాపల్లి-వేగి వెంకటేశ్‌, హిందూపురం నుంచి షాహిన్ పోటి చేస్తున్నారు.

AP Politics: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
New Update

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కడప నుంచి షర్మిల బరిలోకి దిగుతుండగా.. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు పోటి చేస్తున్నారు. బాపట్ల నుంచి జేడీ శీలం రంగంలోకి దూకుతున్నారు. అటు కాకినాడ నుంచి పళ్ళం రాజు.. విశాఖ నుంచి సత్యారెడ్డి పోటి చేస్తున్నారు. అనకాపల్లి నుంచి వేగి వెంకటేశ్‌ ఫైట్‌ చేయనున్నారు. రాజంపేట నుంచి నజీర్ అహ్మద్.. చిత్తూరు బరిలో చిట్టిబాబు.. హిందూపురం నుంచి షాహిన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

విభజన హామీలు, అమరావతి, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని షర్మిలా చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడైన అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు తేలేకపోయారో సజ్జల సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వమన్నారు. ఎంపీగా ఉండి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పోరాటం చేయలేదో అవినాష్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: శ్రీరాముడి అవతారమే మోదీ.. నేను ఉడతను: కంగనా

#ap-elections-2024 #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe