EAP CET : నేటి నుంచే ఈఏపీ సెట్‌.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఆంధ్ర ప్రదేశ్‌ లోని ప్రభుత్వ , ప్రైవేట్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్‌ -2024 గురువారం నుంచి మొదలు కానుంది.

New Update
EAP CET : నేటి నుంచే ఈఏపీ సెట్‌.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

EAPCET Exam : ఆంధ్ర ప్రదేశ్‌(Andhra Pradesh) లోని ప్రభుత్వ , ప్రైవేట్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్‌-2024(AP EAPCET-2024) గురువారం నుంచి మొదలు కానుంది. ఈ పరీక్ష ఈ నెల 23 వ తేదీ వరకు జరగనుంది.

ఈ ప్రవేశ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రా రెడ్డి(Hema Chandra Reddy) తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో బైపీసీ, 18 నుంచి 23 వరకు ఎంపీసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థులు తప్పనిసరిగా తమతో పాటు హాల్‌ టికెట్‌, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని రావాలన్నారు. ఈ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌(Mal-Practice) కు పాల్పడితే డీబార్‌ చేస్తామని హెచ్చరించారు.

Also read: మీరు నిద్రించే విధానంలో మీ వ్యక్తిత్వ రహస్యం దాగి ఉంటుంది.. ఎలాగంటే?

Advertisment
తాజా కథనాలు