Chandrababu: కాన్వాయ్‌ ఆపి మరీ వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు!

మంగళవారం ఉదయం సెక్రటేరియట్‌ నుంచి వెళ్తూ..సచివాలయం బయట ఉన్న సందర్శకులను చూసి ఆయన కాన్వాయ్‌ ను ఆపారు.తమకు సాయం కావాలని వచ్చిన వారిని అందర్ని కూడా బాబు స్వయంగా కలుస్తున్నారు. వారి సమస్యలు విని వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు చేస్తున్నారు.

Chandrababu: కాన్వాయ్‌ ఆపి మరీ వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు!
New Update

CM Chandrababu Naidu: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ప్రజలకు చేరువ అయ్యేందుకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ప్రజలకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సచివాలయంలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.

తమకు సాయం కావాలని వచ్చిన వారిని అందర్ని కూడా బాబు స్వయంగా కలుస్తున్నారు. వారి సమస్యలు విని వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం సెక్రటేరియట్‌ నుంచి వెళ్తూ..సచివాలయం బయట ఉన్న సందర్శకులను చూసి ఆయన కాన్వాయ్‌ ను ఆపారు.

స్వయంగా ఆయనే కారు నుంచి దిగి వారి వద్దకు వచ్చి వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.

Also read: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

#vijayawada #chandrababu-naidu #mangalagiri #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe