AP Assembly Sessions : రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో మరికొన్ని వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.

New Update
AP Assembly Sessions : రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions From Tomorrow : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ 18న అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పలు విభాగాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో  మరికొన్ని వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. మరోవైపు ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ప్రారంభం కానున్నాయి.  

11 మందితో జగన్..

మాజీ సీఎం జగన్‌ (Ex. CM Jagan) హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన వస్తారని మాజీ మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. జగన్‌తో సహా 11 మంది ఎమ్మెల్యేలు వస్తారని.. ప్రభుత్వాన్ని నిలదీస్తారని పేర్కొన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వమిదని.. అసెంబ్లీలో మా వ్యూహాలు మాకున్నాయని అన్నారు.

ఇదిలాఉండగా.. వైసీపీ (YCP) కి 11 సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో జగన్ సాధారణ ఎమ్మెల్యేగానే రానున్నారు. అయితే చర్చల్లో పాల్గొనేందుకు జగన్‌కు తగినంత సమయం లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే అసెంబ్లీలో ఆయన వ్యూహాం ఏంటి.. ఎలాంటి అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారే దానిపై ఆసక్తి నెలకొంది.

Also Read : పాకిస్థాన్ గౌరవం పొందిన ఆయనే మన దేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు!




Advertisment
తాజా కథనాలు