ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
ప్రధాని మోదికి టీడీపీ ఛీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు.
ప్రధాని మోదికి టీడీపీ ఛీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు.
పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్. తెలంగాణలో ఫలితాలు చూసి పవన్ కు మతి భ్రమించినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం పెట్టుకున్నారని అన్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది చంద్రబాబు, తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చు అని అన్నారు. 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి నడుస్తున్నట్లు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం జనసేన అధినేత విశాఖపట్నానికి రానున్నారు. ఆళ్వార్ దాస్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ఏపీలో మిచౌంగ్ సృష్టించిన బీభత్సం గురించి ఆయన ప్రసంగించనున్నారు.
మిచౌంగ్(మిగ్జామ్) తుపాను మరింత బలహీనపడనుంది. అయితే వర్షాలు తగ్గే చాన్స్ మాత్రం ఇప్పుడే లేదు. రానున్న 12-18 గంటల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు భారీ వర్షపాతం సంభవించవచ్చు.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీ తీరం వెంబడి అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. తీరం వెంట అలల తాకిడి ఎక్కువగా ఉంది. మిచౌంగ్ బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విశాఖ, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది.