/rtv/media/media_files/2025/08/03/granite-quarry-in-bapatla-2025-08-03-13-16-49.jpg)
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బల్లికురవ సమీపంలోని దివ్య గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. గ్రాంట్ రాయిని తొలగిస్తుండంగా ప్రమాదం జరిగింది. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాయి క్రింద మొత్తం 12 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.- వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్వారీ లోనికి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు.