AP: వైసీపీ నేతలకు నోటీసులు

AP: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వైసీపీ ముఖ్యనేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు జగన్ పాపప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా నోటీసులు ఇచ్చారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు.

New Update
YSRCP

YSRCP Leaders: మాజీ సీఎం జగన్ పాపప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఏమ్మెల్సీలకు, కీలక నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతలకు నోటీసులను ఎస్ఐలు అందజేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు నోటీసులు ఇచ్చారు. నేతల తరఫున ఎవరు వచ్చినా కఠిన చర్యలు తప్పవని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కాగా మరికొంత మంది ముఖ్య నేతలను ఇప్పటికే పోలీసులు ఆరెస్టు  చేశారు.

నడవడిక వల్ల ఎలాంటి నేర ఘటన చోటుచేసుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. శాంతి భద్రల దృష్ట్యా ఎలాంటి అవాంచనీయ ఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నోటీసులకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. ఏవైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రేపు అన్ని ప్రాంతాల్లో..

తిరుపతి లడ్డూ కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఆసత్య ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కాలువలో కలచివేసిన విషాదం.. కవల పసికందుల మృతదేహాలు లభ్యం

తిరుపతి జిల్లా గూడూరు అశోక్‌నగర్‌ సమీపంలో మురికి కాలువలో రెండు పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా ఈ దృశ్యం చూసిన షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

New Update
tirupathi crime news

tirupathi crime news

AP Crime: తిరుపతి జిల్లాలోని గూడూరు అశోక్‌నగర్‌ సమీపంలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. మురికి కాలువలో రెండు పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా ఈ దృశ్యం చూసిన షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన శిశువులు కవలలుగా గుర్తించారు. అయితే ఎవరు, ఎందుకు, ఎప్పుడు ఈ అమాయకుల ప్రాణాలను తీశారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాలువలో కవలల మృతదేహాలు:

 పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. శిశువుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు  నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. శిశువుల వయస్సు కనీసం రెండు నుంచి మూడు రోజుల మధ్య ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఎవరు వారిని అలా వదిలిపెట్టారన్నది అనుమానాస్పదంగా ఉంది. పుట్టిన కొన్ని రోజుల్లోనే వారి జీవితాలను అంతం చేయడం పట్ల   స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనవత్వం మరిచి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి:  ఇలా చేస్తే లావుగా ఉన్న స్త్రీలు కూడా అందంగా కనిపిస్తారు..!

 పసికందులను కాలువల్లో పడేయడం మానవత్వాన్ని తలపోసే విధంగా ఉంది. కుటుంబంలో, సమాజంలో అర్థం కాని ఒత్తిళ్లు, వివాహేతర సంబంధాలు లేదా పుట్టిన వెంటనే పిల్లలను అంగీకరించని పరిస్థితులు ఇటువంటి దారుణాలకు దారి తీయవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. శిశువుల మృతదేహాలు కాలువలోకి కొట్టుకు వచ్చాయా ? లేక ఎవరైనా తెచ్చి పడేశారా అన్న కోణంలో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించే క్రమంలో శిశువుల మృతదేహాలు బయటపడినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ విషాదకర ఘటన వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకునేందుకు  పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమీపంలోని ఆస్పత్రులు, ప్రసూతి కేంద్రాల్లో ఇటీవల పుట్టిన శిశువుల వివరాలు సేకరిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: జిమ్‌కు ఏ టైమ్‌లో వెళ్లాలి? ఉదయమా? సాయంత్రమా? నేను చెబుతా చదవండి!

AP Crime | ap crime updates | ap-crime-news | Latest News | telugu-news )

Advertisment
Advertisment