/rtv/media/media_files/2025/03/24/UyfxUaZ6sxg1jD8dWXYf.jpg)
Nara Lokesh Temple Visit
Nara Lokesh: సిక్కుల పవిత్ర ఆలయమైన స్వర్ణ దేవాలయాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆధ్యాత్మిక ప్రశాంతతకు మారు పేరైన ఈ స్వర్ణ దేవాలయం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో కొలువై ఉంది. నారా లోకేశ్ తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్తో కలిసి ఆదివారం ఉదయం ఈ దేవాలయాన్ని సందర్శించారు. సంప్రదాయ వస్త్రాలతో తల పాగా ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. స్వర్ణమందిర్ చరిత్ర, విశేషాలు, ప్రత్యేకతలను శ్రీహర్మందిర్ సాహిబ్ నిర్వాహకులు నారా లోకేష్ దంపతులకు వివరించారు.
Also Read: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇచ్చింది..
స్వర్ణ దేవాలయం సందర్శనంతరం స్థానిక లంగర్హౌస్ను పరిశీలించారు లోకేష్, రోజూ వేల మంది భక్తులకు ఆహారం అందించే స్వర్ణ దేవాలయం వడ్డనా పదార్థాలను, ఆహరం ఎంత మందికి అందిస్తున్నారు అన్న విషయాలపై లోకేష్ ఆరా తీశారు. దేవాలయంలో ఎంత మంది పని చేస్తున్నారు, నిర్వహణా విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ ‘‘అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించాను. పవిత్ర హర్మందిర్ సాహిబ్ను సందర్శించే అవకశం దొరకడం నా అదృష్టం, నాకు ఎంతో సంతోషంగా ఉంది. సిక్కు గురువుల ఆశీస్సులు పొందాను. ఆ ఆవరణలో గడిపిన సమయం నా మనస్సుకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇచ్చింది’’ అన్నారు.
Also Read: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
Also Read: Viral video: ఫోన్లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!
స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్ దంపతులు
— ChotaNews App (@ChotaNewsApp) March 23, 2025
లోకేశ్తో పాటు భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ pic.twitter.com/GmgUy6epKu