/rtv/media/media_files/2025/01/18/vqvX7ilczoaNKOXWRppb.jpg)
Pawan Kalyan
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. జనసేన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్ లు అన్ని కోణాల్లో విచారణ జరిపాయి. ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్, శానిటేషన్, రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగురవేశారని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ అధికారులతో చర్చించి నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: లోకేష్ డిప్యూటీ సీఎం.. TDP హైకమాండ్ సంచలన ప్రకటన!
పవన్ ఇంటిపై డ్రోన్.. ఫైబర్ నెట్దే! pic.twitter.com/WXj5Hnk4jP
— suryadevara (@suryadevara1585) January 20, 2025
శనివారం మంగళగిరి క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. 20 నిమిషాల పాటు ఆఫీసుపై డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు సిబ్బంది గుర్తించారు. మధ్యాహ్నం 1:30 నిమిషాల నుంచి 1:50 వరకు డ్రోన్ ఎగిరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ పై దాడికి కుట్ర జరుగుతుందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh Deputy CM: లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే.. పవన్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ బిగ్ షాక్!
గతంలో పవన్ ప్రోగ్రామ్ లో ఫేక్ ఐపీఎస్..
గతంలో పవన్ పాల్గొన్న కార్యక్రమంలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి ఆగంతకుడి నుంచి పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ సైతం వచ్చాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో పవన్ భద్రతపై జనసేన నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఫైబర్ నెట్ అధికారులో ఈ డ్రోన్ ను ఎగరేసినట్లు పోలీసులు గుర్తించడంతో జనసేన నేతలు ఊపిరి పీల్చుకున్నారు.