విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. ఏపీ సీఐడీ నోటీసులు!

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

New Update
Vijayasai Reddy

Vijayasai Reddy

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపు వ్యవహారంలో ఏపీ సీఐడీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 10న ఓ సారి నోటీసులు జారీ చేసింది సీఐడీ. ఈ నోటీసులకు సంబంధించి 12న ఇప్పటికే ఆయన విచారణకు హాజరయ్యారు. తొలిసారి విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసు అని అభివర్ణించారు. పోర్టు యజమాని కేవీ రావుతో ముఖపరిచయం తప్పా ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. విక్రాంత్ రెడ్డి తనకు వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే తెలున్నారు. అయితే ఓ మిత్రుడి ద్వారా ఈ కేసు గురించి కేవీరావుతో మాట్లాడించాన్నారు. ఓ అధికారి ఆదేశాలతోనే తన పేరు ఈ కేసులో ఇరికించినట్లుగా కేవీ రావు చెప్పారన్నారు. విక్రాంత్ రెడ్డిని కేవీరావుకు విక్రాంత్‌రెడ్డిని తాను పరిచయం చేయలేదున్నారు. ఈ విషయాన్నే సీఐడీ అధికారులకు వివరించినట్లు చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీడీపీ హైకమాండ్ కు భూమా అఖిల ప్రియ వార్నింగ్!

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా ఎవరైనా నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటే ఊరిలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు.

New Update

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ మహానాడు వేదికగా టీడీపీ అధిష్టానానికి అఖిలప్రియ అల్టిమేటం ఇచ్చారు. మాకు తెలియకుండా ఎవరికైనా పదవులు ఇస్తే.. ఊర్లో అడ్డుపెట్టనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికి పదవులు ఇప్పిస్తామన్నారు అఖిలప్రియ. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే పదవులివ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment