కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు!

తిరుపతి లడ్డూ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా? ఇక చాలు ప్రజలకోసం చెయ్యవలసిన పనులు చూడండి. ఎనఫ్‌ ఇజ్ ఎనఫ్‌ జస్ట్ ఆస్కింగ్ అంటూ.. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా X ఖాతాలో పోస్ట్ చేశారు.

Prakash Raj
New Update

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని అధికార కూటమి ప్రభుత్వం వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని వైసీపీపై మండిపడుతుంది. ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపారని ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణులు చేస్తున్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సనాతన ధర్మం పేరుతో ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే తిరుపతి మెట్లు కడిగి శుద్ది చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఈ వ్యవహారాన్ని ఎవరు కూడా కామెడీగా తీసుకోవద్దని.. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ వ్యవహారం పై ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటు నటుడు ప్రకాశ్ రాజ్ సైతం రియాక్ట్ అవుతున్నారు. ఈ వివాదంపై తనదైన శైలిలో కౌంటర్‌లు ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించి దానికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడంతా డిప్యూటీ సీఎం పవన్ వెర్సస్ ప్రకాష్ రాజ్ అన్నట్లుగానే ఉంది. 

ఇది కూడా చదవండి: తిరుపతి లడ్డూ.. సుప్రీంకోర్టు కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ పోస్ట్

ఈ లడ్డూ వివాదం సుప్రీ కోర్టు వరకు చేరుకుంది. ఈ మేరకు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. లేకపోతే లడ్డూ కల్తీ అయినట్లు భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని అడిగింది. దీనికి సంబంధించిన విచారణ పూర్తి కాకముందే ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని భక్తుల మనోభావాలు దెబ్బతీయడం సరైన పద్దతి కాదని తెలిపింది. 

దేవుళ్లను రాజకీయం చేయొద్దని ఈ మేరకు వార్నింగ్ ఇచ్చింది. దీనిపై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ షేర్ చేస్తూ.. ‘‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్’’ అంటూ ఆ పోస్టర్‌లో రాసుకొచ్చారు. ఆయన పోస్ట్ వైరల్‌గా మారడంతో పలువురు రకరకాలుగా స్పందించారు.

అయితే ఇది మరువక ముందే ప్రకాష్ రాజ్ మరో ట్విట్‌ చేశారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ ‘‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!.. కదా?.. ఇక చాలు.. ప్రజలకోసం చెయ్యవలసిన పనులు చూడండి.. ఎనఫ్‌ ఇజ్ ఎనఫ్‌ జస్ట్ ఆస్కింగ్’’ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రకాష్‌ రాజ్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్‌గా మారింది. మరి ఈ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? లేదా? అనేది చూడాలి. 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe