Andhra Pradesh Sanitation: మునిసిపల్ సిబ్బంది ధర్నా నేపథ్యంలో ఏపీ సర్కార్(Andhra Pradesh Government) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డ సచివాలయ సిబ్బందికి శానిటేషన్(Sanitation) బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికార వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్(Municipal) సిబ్బంది సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో నగరాల్లో చెత్త పేరుకుపోయింది. దీంతో చెత్త క్లీనింగ్ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే.. చెత్త క్లీనింగ్ చేయించే పనిలో సచివాలయ సిబ్బంది ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అడ్మిన్, శానిటేషన్ సెక్రెటరీతో పాటు మిగిలిన సెక్రటరీలు ఇదే పనిలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది సర్కార్.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. వాలంటీర్లకు శానిటేషన్ బాధ్యతలు?
మున్సిపల్ కార్మికుల ధర్నా నేపథ్యంలో శానిటేషన్ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు అధికారిక సమాచారం అందుతోంది.
Translate this News: