AP : ముందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సర్కార్.. రెండు రోజులు పండగే

మందు బాబులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ లు అర్ధరాత్రి 12 గంటల వరకూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. గవర్నమెంట్ పర్మిషన్ తో నడిచే పార్టీల్లో 1గంట వరకూ మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని చెప్పింది.

New Update
AP : ముందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సర్కార్.. రెండు రోజులు పండగే

AP : మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ (New year) సెలబ్రేషన్స్ లో అర్ధరాత్రి వరకూ మందేసి చిందేసేలా మరింత సౌలభ్యం కల్పించింది. సాధారణ సమయవేళలకంటే ఈ రెండు రోజులు అధికంగా వసూళ్లు రాబట్టేందుకు అన్ని వైన్స్ (Wines) లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులతోపాటు పబ్, క్లబ్, బార్ ల టైమింగ్స్ మరింత పెంచుతూ అధికారిక ప్రకటన చేసింది.

కొత్త సంవత్సర ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ అనుమతితో నడిచే రాష్ట్రంలోని పబ్‌లు, బార్లు, ఈవెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో మందు బాబులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. జగన్ సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి : KURNOOL: కీచక తల్లి.. పసిపిల్లలను నీటి బకెట్‌లో ముంచి దారుణం

ఇదిలావుంటే.. ఈ వేడుకల కోసం వచ్చే కస్టమర్లకు పాపులర్ హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (Hotels) షాక్ ఇస్తున్నాయి. రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లు భారీగా పెంచేశాయి. ఢిల్లీ (Dellhi), జైపూర్ (Jaipur), ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (Udaiur)లోని లీలా ప్యాలెసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (Pales)హోటల్స్ అండ్ రిసార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో రూమ్ రేట్లు రికార్డ్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాయి. ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తమ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  డిసెంబర్ 31 కోసం రూమ్స్ ఖాళీగా లేవని,  అదే క్రిస్మస్ రోజున రూ.1,06,200 చార్జ్ చేశామని చెప్పారు. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (Rajastan) లోని సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్వారలో  డిసెంబర్  31 కోసం సింగిల్ నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.1,20,000 వసూలు చేస్తుండగా.. ‘మా హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మహారాజా సూట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చాలా ఎంక్వైరీలు వచ్చాయని, వీటి ధర ఒక రాత్రికి రూ.7 లక్షలు  ఉంటుందని కంపెనీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెరా (Rajath gera) స్పష్టం చేశారు. దీంతో హోటల్స్ వెళ్లేందుకు కస్టమర్లు జంకుతున్నారు.

Advertisment
తాజా కథనాలు