Amit Shah On Delhi Ordinance Bill : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (DELHI ORDINANCE) రాజ్యాంగబద్ధమేనని హోమ్ మంత్రి అమిత్ షా (AMIT SHAW) ప్రకటించారు. ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చించజాలమన్న విపక్షాల వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాలకు ఉద్దేశించినవని ఆయన వ్యాఖ్యానించారు. వివాదాస్పదమైన ఆర్డినెన్స్ స్థానే తెచ్చిన ఈ బిల్లును మొదట హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లు-2023 పేరిట దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ బిల్లుపై సుదీర్ఘంగా మాట్లాడిన అమిత్ షా, ఢిల్లీకి సంబంధించినంతవరకు ఏ చట్టాన్నయినా సభ ఆమోదించేందుకు రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చిందన్నారు. అలాగే హస్తినకు సంబంధించిన ఏ శాసనాన్నయినా పార్లమెంట్ కి తేవచ్చని సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్య చేసిందని గుర్తు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. 249 అధికరణం కింద ఏ చట్టాన్నయినా తెచ్చేందుకు ఈ సభకు అధికారాలున్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల పోస్టింగులు, బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కే అధికారాలను కట్టబెట్టడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై అమిత్ షా ఏమంటున్నారంటే …
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రసంగించారు. విపక్షాల తీరును తప్పుపట్టారు. మరో వైపు విపక్ష కూటమి సభ్యులు మణిపూర్ అంశంపై చర్చించాలని పట్టుపట్టారు. అనంతరం సభ నుంచి వాకెట్ చేశారు.
Translate this News: