సమయం లేదు
హైదరాబాద్ రహదారుల విస్తరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూములు కొరేందుకు, విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. అయితే, ఇతర సమావేశాల్లో పాల్గొంటున్న హోం మంత్రికి కేటీఆర్తో సమావేశమయ్యేందుకు సమయం దొరకలేదు. మణిపూర్ హింసపై అఖిల పక్ష భేటీ, తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశం, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులతో వరుస సమావేశాల కారణంగా కేటీఆర్కు ఇచ్చిన అపాయింట్మెంట్ సమయం దాటిపోయింది. అప్పటికీ ఇంకా ఇతర మీటింగ్స్ మిగిలి ఉండటంతో అపాయింట్మెంట్ రద్దు అయినట్టు కేంద్ర హోం శాఖ అధికారులు మంత్రి కేటీఆర్కు సమాచారం అందించారు.