• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » Godavari flood: గొగుల్ లంక వద్ద వశిష్ట గోదావరి ఉధృతం

Godavari flood: గొగుల్ లంక వద్ద వశిష్ట గోదావరి ఉధృతం

Published on July 22, 2023 12:07 pm by Vijaya

ఐదు రోజులుగా ఏపీని వర్షాలు వీడటం లేదు. భారీ వానతో గోదారమ్మ (Godavari River) వరద ప్రవాహం మరింత ఉధృతంగా మారుతుంది. ఈ భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి నదిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకా గోదావరి ఎంత ఉగ్రరూపం దాల్చుతుందోనని భయంతో జీవిస్తున్నారు.

Translate this News:

Ambedkar Konaseema District Gogul Lanka Emergence of Vashishtha Godavari

ఈ వాన ఎప్పుడు ఆగుతుంది:

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షం పడితే చాలు రాష్ట్రంలో ఉన్న వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతుంటాయి. అటు గోదావరి నది మాట అయితే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ వర్షాలప్పుడు గోదావరి నదికి (Godavari River) వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. దీంతో 5 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి నదిలో వరద నీరు ప్రవాహం చాలా పెరుగుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతూ.. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఏపీ(Andhra Pradesh)లోని ధవళేశ్వరం బ్యారేజీ 13.5 అడుగుల వద్ద ఉంది. అంతేకుండా ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతున్నకొద్ది ప్రమాద హెచ్చరిక నెంబర్లు జారీ చేసే అవకాశం ఉంది. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో అటు అధికార యంత్రాంగం కూడా హైఅలర్ట్ అయింది. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(NDRF)ను, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేసింది ఏపీ ప్రభుత్వం.

ఈ వర్షాల కారణంగా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో వరద పరిస్థితుల దృష్ట్యా సుమారు 200 బోట్లను అధికారులు సిద్దంగా ఉంచారు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి, గొగుల్ లంక వద్ద ఉధృతంగా వశిష్ట గోదావరి ప్రవహిస్తుంది. లంక గ్రామాల్లో ప్రజలు పర్యటించ వద్దని అధికారులు చెప్పారు. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరిగితే లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు.

టెన్షన్‌.. టెన్షన్‌:

గంటగంటకు గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో కోనసీమలోని లంక గ్రామాల్లోని ప్రజల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఉప్పొంగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే కొన్ని లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం నాటుపడవలపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. అటు విలీన మండలాల్లోనూ భారీ వర్షాలకు గోదావరి, శబరి నది పొంగి ప్రవహిస్తోంది. అటు సోకిలేరు వంతెనపై కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో చింతూరు – విఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు వీఆర్‌పురం మండలం ములకపాడు గ్రామంలోకి కూడా గోదావరి పోటెత్తింది. దీంతో గ్రామస్తులు కొండలపైకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడే తాత్కాలిక గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

ఆర్‌టీవీ కథనం ప్రత్యేక ఏర్పాట్లు

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి, గొగుల్ లంక వద్ద వశిష్ట గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక పక్క గోదావరి వరద ఉధృతి, మరోపక్క ప్రమాదకర పడవ ప్రయాణాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధమైన సేఫ్టీ జాకెట్‌లు లేకుండా స్కూల్ విద్యార్థులతో, కూలీలతో గోదావరి ఒడ్డును దాటుతున్నారు. అంతే కాకుండా పడవ నడిపేవారికి సరైన అవగాహన లేకపోతే గోదావరి ఉధృత వడికి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. సుమారు 35 మంది విద్యార్థులును పడవపై ఎక్కించుకుని ఎలాంటి సేప్టీ సైడ్ లైఫ్ జాకెట్లు వేసుకోకుండా పడవ నడుపుతున్నారని నిర్వాహకులపై ప్రజలు మండిపడ్డుతున్నారు. గుత్తెనదీవి, గోగుల్ లంక రేవు వద్దకు చేరుకున్న ఆర్టీవీ(RTV)ప్రయాణాలపై ఆరా తీయగా.. పడవ నిర్వాహకుల ప్రయాణాలను నిలిపేశారు. RTV కథనంతో అప్రమత్తమైన అధికారులు రాకపోకలు నిలిపివేశారు. రెవెన్యూ, ఫిషరీస్, పోలీసు అధికారులు లైఫ్ జాకెట్లుతో ప్రభుత్వం బోట్లు నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని RTVతో చెప్పారు.

Primary Sidebar

KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్

KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్

Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

waheeda, dada saheb award

movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం

lawrence met rajini

movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ

aleru mla sunitha

Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

niharika in USA

Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online