Minister Ambati Rambabu: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Naidu)కు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెల్లడించింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ నెల 30న ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. చంద్రబాబుకు బెయిల్ రాయడంతో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..మూల్యం చెల్లిస్తారు..టిడిపి నాయకులకు అంబటి వార్నింగ్..!
టిడిపి నాయకులపై ఫైర్ అయ్యారు మంత్రి అంబటి. ‘‘వచ్చింది బెయిలే.. నిర్దోషి అని తీర్పు కాదు రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ, ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారు.. మూల్యం చెల్లిస్తారు !’’ అంటూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు.

Translate this News: