Amalapuram Political War: అమలాపురంలో మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. పాతకక్షల కారణంగా వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా చంపారు. హత్య జరిగిన కొన్ని గంటలకే టీడీపీ నేత ఆఫీస్కు దుండగులు నిప్పంటించారు. ఆఫీస్ తగలబడుతుండగానే ఈదరపల్లిలో మరో వ్యక్తి ఇంటిని ధ్వంసం చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారకముందే అమలాపురాన్ని పోలీసులు దిగ్బంధించారు. పరిస్ధితిని కట్టడి చేసేందుకు డీఐజీ సైతం రంగంలోకి దిగారు. హుటాహుటిన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ శ్రీధర్ అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేత పల్లంరాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
పూర్తిగా చదవండి..Amalapuram Political War: టీడీపీ నేత ఆఫీస్కు నిప్పు..అమలాపురంలో అసలేం జరుగుతోంది?
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్న మధ్యాహ్నం ఓ వ్యక్తిని పట్టపగలే దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటలకే టీడీపీ నేత ఆఫీస్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు అమలాపురాన్ని పోలీసులు దిగ్బంధించారు.
Translate this News: