దారిద్ర్యరేఖకు ఎవరైతే దిగువన ఉన్నారో వారంతా రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హులు అవుతారు. పేద ప్రజల జీవనాన్ని పరిగణలోనికి తీసుకుని పలు రాష్ట్రాలు రేషన్ కార్డులను జానీ చేశాయి..ఇఫ్పటికీ చేస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో చాలా కీలకంగా వ్యవహారిస్తోంది కేసీఆర్ సర్కార్. ఎందుకంటే తెలంగాణలో బోగస్ కార్డులు తొలగించాలన్న లక్ష్యంతో రాష్ట్రమంతా రేషన్ ఈకేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. దీంతో అన్ని చోట్ల రేషన్ షాపుల వద్ద పెద్దెత్తన క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కుటుంబం అంతా కూడా వేలిముద్రలు ఇచ్చి కేవైసీని పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఈ కేవైసీకి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30వ తేదీ అనే ప్రచారం జరుగుతుండంతో ప్రజలు రేషన్ షాపుల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని పౌరసరఫరా శాఖ స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Ration Card Updates: రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్..! ఈ విషయం తప్పక తెలుసుకోండి..!!
రేషన్ కార్డుల విషయంలో కీలకంగా వ్యవహారిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో కేవైసీ చివరి తేదీ, రేషర్ కార్డుతో కుటుంబ సభ్యుల వివరాలు వంటి తదితర అంశాలపై ప్రతిఒక్కరూ ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.
Translate this News: