Akkineni Family : వరద బాధితులకు అండగా అక్కినేని ఫ్యామిలీ.. రూ.కోటి విరాళం

తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం అక్కినేని కుటుంబం అంతా కోటి రూపాయల విరాళం అందజేశారు. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

New Update
Akkineni Family : వరద బాధితులకు అండగా అక్కినేని ఫ్యామిలీ.. రూ.కోటి విరాళం

Akkineni Family :  తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల న‌ష్ట‌పోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్‌ బాలకృష్ణ, మహేశ్‌బాబు, విశ్వక్‌సేన్‌, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు విరాళం ప్రకటించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో అక్కినేని ఫ్యామిలీ సైతం చేరింది. వరద బాధితుల కోసం అక్కినేని కుటుంబం అంతా కోటి రూపాయల విరాళం అందజేశారు.

ఈ మేరకు అక్కినేని ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..' శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుంటారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం.

Also Read : వరద బాధితులకు ప్రభాస్ నిజంగానే విరాళం ఇచ్చాడా? అసలు క్లారిటీ ఇదే

ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం' అని పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్ ని అందజేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు