AI Treatment: దేశంలోనే తొలిసారి.. AIతో 62ఏళ్ల రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స!

గుర్గావ్‌లోని మెదాంత హాస్పిటల్ రక్తం గడ్డకట్టే సమస్యలతో బాధపడుతున్న రోగికి AIసాంకేతికతో చికిత్స చేసింది. 62 ఏళ్ల రోగి ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తం గడ్డను AIటెక్నాలజీతో విజయవంతంగా తొలగించారు. ఇలాంటి ఆపరేషన్ జరగడం దేశంలోనే తొలిసారి.

New Update
AI Treatment: దేశంలోనే తొలిసారి.. AIతో 62ఏళ్ల రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స!

దేశవ్యాప్తంగా గుండెపోటు(Heart attack) కేసులు పెరుగుతున్నాయి. శరీరంలో రక్తం గడ్డకట్టడం కూడా గుండెపోటుకు ప్రధాన కారణం. రక్తం సక్రమంగా ప్రవహించకపోవడం వల్ల ఏ వ్యక్తి శరీరంలోనైనా ఈ గడ్డలు ఏర్పడతాయి. ఈ రోజుల్లో, గుండె ధమనిలో రక్తం గడ్డకట్టే కేసులు పెరుగుతున్నాయి. దీనినే థ్రాంబోసిస్(Thrombosis) అంటారు. అన్ని ఆసుపత్రుల్లో ఈ వ్యాధి చికిత్స విధానం భిన్నంగా ఉంటుంది.

పెనుంబ్రా ఫ్లాష్ టెక్నిక్ ద్వారా చికిత్స:
గుర్గావ్‌లోని మెదాంత హాస్పిటల్‌లో థ్రాంబోసిస్‌కు AI(Artificial Intelligence) ఆధారిత సాంకేతికత పెనుంబ్రా ఫ్లాష్ 12 ఎఫ్ కాథెటర్ టెక్నాలజీతో చికిత్స చేస్తారు. ఇటీవల, మెదాంత గ్రూప్ ఛైర్మన్, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ తన బృందంతో కలిసి పెనుంబ్రా ఫ్లాష్ 12 ఎఫ్ కాథెటర్ టెక్నాలజీ ద్వారా విజయవంతమైన శస్త్రచికిత్సను నిర్వహించారు. దీని ద్వారా పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతున్న 62 ఏళ్ల రోగి ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తం గడ్డను తొలగించారు. ఇండియాలో ఈ టెక్నాలజీని అవలంబిస్తున్న తొలి హాస్పిటల్ మేదాంత. ఇప్పటి వరకు, జూలై 2023 నుంచి ఈ టెక్నిక్ ద్వారా 25 మంది రోగులకు శస్త్రచికిత్స జరిగింది. దీని ద్వారా అధికశాతంలో రక్తస్రావం జరుగుతుంది. రోగి కోలుకోవడం కూడా వేగంగా జరుగుతుంది. రోగి ఎక్కువసేపు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. పల్మనరీ ఎంబోలిజం అనేది రక్తం గడ్డకట్టడం, ఇది ఊపిరితిత్తులలోని ధమనిలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది లేదా ఆపుతుంది.

publive-image AI శస్త్రచికిత్సా విధానంతో రక్తం గడ్డలను తొలగించడానికి సహాయపడుతుంది.

15 నిమిషాల్లోనే చికిత్స:
ఈ ప్రక్రియకు కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టింది. ఈ AI ఆధారిత సాంకేతికత ద్వారా ఛాతీ, ధమనులు తెరవకుండానే రక్తం గడ్డను సులభంగా తొలగించవచ్చని మెదాంత గ్రూప్ ఛైర్మన్ అండ్‌ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ చెప్పారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ తరుణ్ గ్రోవర్ మాట్లాడుతూ, రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాలులో నొప్పి, వాపు రావడంతో అత్యవసర చికిత్సకు తీసుకువచ్చారు. మేము పెనుంబ్రా ఫ్లాష్ 12 ఎఫ్ కాథెటర్ ద్వారా రోగి ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడాన్ని తొలగించారు. ఆ వెంటనే నొప్పి, వాపు నుంచి రోగి ఉపశమనం పొందాడు. రోగి మొత్తం ప్రక్రియను చూడగలిగేలా లోకల్ అనస్థీషియా ఇవ్వడం ద్వారా ఈ శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతుంది.

వేగవంతమైన.. మెరుగైన చికిత్స:
ఈ సాంకేతికత ద్వారా పల్మనరీ ఎంబోలిజంతో బాధపడుతున్న రోగులకు వేగంగా, మెరుగైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని డాక్టర్ నరేష్ ట్రెహాన్ చెప్పారు. ఈ తీవ్రమైన పరిస్థితి గురించి అవగాహన పెంచడానికి, మేదాంత PERT (పల్మనరీ ఎంబోలిజం ఇంటర్వెన్షన్ అండ్ రెస్పాన్స్ టీమ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో పెరుగుతున్న పల్మనరీ ఎంబోలిజం కేసుల మధ్య అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం అంకితం చేశారు. PEiRT ప్రోగ్రామ్‌ను ప్రత్యేక బృందం నిర్వహిస్తుంది. ఇందులో అన్ని విషయాలపై నిపుణులను చేర్చారు.

Also Read: ఆ ఇద్దరి కెరీర్‌ ముగిసినట్టేనా? ఫేర్‌వెల్‌ మ్యాచైనా ఆడనిస్తారా?

Advertisment
తాజా కథనాలు