LK Advani: ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన అద్వానీ!

బీజేపీ సీనియర్ నేత , మాజీ ఉప ప్రధాని ఎల్‌ కే అద్వానీ (96) ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.ఆయన వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.

LK Advani: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత... అపోలోకి తరలింపు
New Update

Lk Advani: బీజేపీ సీనియర్ నేత , మాజీ ఉప ప్రధాని ఎల్‌ కే అద్వానీ (96) ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి ఆయనని తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యుల బృందం పర్యవేక్షించింది.

అద్వానీకి మూత్ర సంబంధ వ్యాధుల నిపుణులు, హద్రోగ నిపుణులు, వృద్ధాప్య సంబంధ వ్యాధుల నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఆయన వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గురువారం సాయంత్రం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

Also read: హైదరాబాద్‌ లో భారీ వర్షం…మరో మూడు రోజులు ఉంటుందన్న ఐఎండీ!

#aiims #discharge #lk-advani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe