Gautam Adani Becomes Asia’s Richest Man: బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని (Mukesh Ambani) వెనక్కి నెట్టి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి భారతదేశపు అత్యంత సంపన్నుడిగా మారారు. షేర్ల పెరుగుదల కారణంగా, గౌతమ్ అదానీ ప్రపంచ ర్యాంకింగ్లో టాప్ 12లో తన స్థానాన్ని సంపాదించుకోగా, అంబానీ ఒక స్థానం దిగజారి 13వ స్థానంలో ఉన్నాడు. గౌతమ్ అదానీ నికర విలువ ఒక సంవత్సరంలో 13 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.08 లక్షల కోట్లు) పెరిగి 97.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8.12 లక్షల కోట్లు) చేరుకుంది. కాగా, ముఖేష్ అంబానీ నికర విలువ ఈ ఏడాది రూ.665 మిలియన్లు (సుమారు రూ. 5 వేల కోట్లు) పెరిగి 97 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8.07 లక్షల కోట్లు) చేరింది.
పూర్తిగా చదవండి..Adani vs Ambani: భారతదేశపు అత్యంత సంపన్నుడు అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి..
రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ గ్రూప్ ఛైర్మన్ అదానీ భారతదేశపు అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ప్రపంచ ర్యాంకింగ్ లో కూడా అదానీ 12వ స్థానంలోనూ.. అంబానీ 13వ స్థానంలోనూ ఉన్నట్టు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
Translate this News: