Accident: సినీ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం!

సీని ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కర్ణాటకు చెందిన బుల్లితెర నటి పవిత్ర ఆదివారం శేరిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పవిత్ర 'త్రినయని' సీరియల్‌లో నటిస్తోంది.

Accident: సినీ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం!
New Update

Television Actress Pavithra Jayaram Dies In Road Accident: కర్ణాటక సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బుల్లితెర నటి ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఆదివారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మేరకు సీరియల్ నటి పవిత్ర (42) కర్నాటకలోని తన సొంతూరు వెళ్లి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలోనే కారులో తన బంధువు ఆపేక్ష, తోటి నటుడు చంద్రకాంత్ డ్రైవర్ శ్రీకాంత్ ఉండగా.. అనుకోకుండా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో పవిత్ర అక్కడికక్కడే మరణించగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక నటి పవిత్ర 'త్రినయని' అనే సీరియల్‌లో (Trinayani Serial) విలన్ పాత్రలో నటిస్తోంది.

Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ – రామ్ లుక్ అదుర్స్, టీజర్ ఆరోజే?

#pased-away #actress-pavitra
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe