Bengaluru Bandh: కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు బంద్కు పిలుపునివ్వడంతో మంగళవారం అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేఏ దయానంద సెలవు ప్రకటించారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్కు అంతిమ సంస్కారం చేస్తూ కన్నడ రైతులు నిరసన వ్యక్తం చేశారు. తాగుకు, సాగుకు నీళ్లు లేని కరవు పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రానికి నీటిని విడుదల చేయవద్దంటూ ఆందోళన తీవ్రతరం చేశారు .సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 15 రోజుల పాటు తమిళనాడు రాష్ట్రానికి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై సిద్ధరామయ్య ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
పూర్తిగా చదవండి..Bengaluru Bandh: ముదురుతున్న కావేరీ జల వివాదం.. కన్నడిగులకు నటుడు సుదీప్ మద్దతు
కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు.
Translate this News: