Saptagiri: పవన్ కళ్యాణ్ ఇందుకే పరితపిస్తున్నాడు.. సప్తగిరి సంచలన వ్యాఖ్యలు..!

పేద ప్రజలకు సేవ చేయడానికి పరితపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నటుడు సప్తగిరి కొనియాడారు. విశాఖ జిల్లా కన్నూరు పాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేవారు కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Saptagiri: పవన్ కళ్యాణ్ ఇందుకే పరితపిస్తున్నాడు.. సప్తగిరి సంచలన వ్యాఖ్యలు..!
New Update

Actor Saptagiri:పేద ప్రజల కోసం సేవ చేయడానికి పరితపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నటుడు సప్తగిరి అన్నారు. కసింకోట మండలం కన్నూరు పాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సినీ పరిశ్రమలో కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్న ప్రజలకు సేవ చేయాలన్న పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేవారు కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: రోజాని.. భర్త భరించలేకే వేరే ఉంటున్నాడు.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!

ఉత్తరాంధ్రకు సృజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిజాయితీపరుడైన కొణతాల రామకృష్ణకు పవన్ కళ్యాణ్ కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సృజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి అయితే ఉత్తరాంధ్రలోని ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ప్రజల అభివృద్ధికి ఏ పార్టీ మేనిఫెస్టో ఉపయోగపడుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Also Read: వామ్మో.. ఈ ముసలోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పుష్ప-3 సినిమాను చూపించాడు..!

కూటమి మేనిఫెస్టోలో మహిళా అభివృద్ధికి పెద్దపీట వేశారని సప్తగిరి అన్నారు. ప్రజలు నిజాయితీగా ఆలోచించి తమ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సప్తగిరి కోరారు. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిత్యవసర ధర వస్తువులను సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసిందని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో కరెంట్ బిల్లును 9సార్లు పెంచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి అన్నారు.

#saptagiri #jana-sena-chief-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి