Road accident: హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి!

యమునా ఎక్స్‌ప్రెస్ పై కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో..కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.

New Update
Road accident: హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి!

శుక్రవారం అర్థరాత్రి గ్రేటర్ నోయిడా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్ పై కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో..కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

రబూపురా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై అతి వేగంతో వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం..ఎకో కారు ను వెనుక నుంచి చాలా స్పీడుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.

ఆ సమయంలో కారులో 8 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ చిన్నారులను చికిత్స కోసం జెవార్‌ లోని కైలాష్‌ ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారుల పరిస్థితి కూడా విషమంగా ఉంది. కారులో ఉన్న వారు ఢిల్లీ నుంచి జార్ఖండ్‌ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.

గ్రేటర్‌ నోయిడా నుంచి జేవార్‌ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఉపేంద్ర బైతా (38), బిజేంద్ర బైతా (36), కాంతి దేవి (30), కువ్ జ్యోతి (12), సురేష్ (45) వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన ముగ్గురిని సూరజ్ (16).
ఆయుష్ (08), ఆర్యన్ (10) లు గా పోలీసులు గుర్తించారు.

Also read: బాయ్స్‌ హాస్టల్ లో అగ్ని ప్రమాదం..కాలి బూడిదయిన సర్టిఫికేట్లు, వస్తువులు!

Advertisment
తాజా కథనాలు