ఇండిగో ఫ్లైట్ ఏసీలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా ట్వీట్ చేశారు. ఇండిగో ఫ్లైట్ చండీఘడ్ నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ పరిస్థితి ఎదురైనట్లు చెప్పారు. విమానంలోకి వెళ్లేందుకు పది నుంచి పదిహేను నిమిషాలపాటు ఎండలో క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఏసీ ఆన్ లో లేకపోయినా విమానం టేకాఫ్ అయ్యిందని వివరించారు. ఎయిర్ కండీషనర్లు పనిచేయడం లేదని వారింగ్ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విమానయాన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలను ఆయన కోరారు.
పూర్తిగా చదవండి..ఇండిగో ఫ్లైట్లో పనిచేయని ఏసీ..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు..!!
ఇండిగో విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో 90నిమిషాల పాటు తీవ్రంగా ఇబ్బందులు పడ్డామంటూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ శనివారం ట్వీట్ చేశారు. ఇండిగో ఫ్లైట్ ఛండీఘడ్ నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలిపారు. చెమటలు తూడ్చుకునేందుకు ఫ్లైట్ సిబ్బంది టిష్యూలు అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Translate this News: