Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ సుమారు 8.5 కిలోల బరువు తగ్గినట్లు ఆయన వివరించారు.

Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!
New Update

Kejriwal Lost 8.5 kg: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ (AAP MP Sanjay Singh) ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ సుమారు 8.5 కిలోల బరువు తగ్గినట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా ఐదు సార్లు కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్‌ కూడా 50 కి పడిపోయినట్లు ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి ఆరోగ్యం ఇంతలా క్షీణించడం కూడా తీవ్ర అనారోగ్యానికి సంకేతమని ఆయన పేర్కొన్నారు. షుగర్ లెవెల్ ఆకస్మికంగా పడిపోవడం వల్ల కోమాలోకి కూడా వెళ్లవచ్చు. మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam) మనీలాండరింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రికి ఒకరోజు ముందు అంటే శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తరుణంలో సంజయ్ సింగ్ తరపున ఈ వాదన వినిపించింది.

అయితే ఆయన బయటకు రాలేకపోయారు. ఎందుకంటే సంబంధిత కేసులో సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:నా మిత్రుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నాను.. మోదీ ట్వీట్

#delhi-liquor-scam-case #arvind-kejriwal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe