Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్! ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్ సింగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుమారు 8.5 కిలోల బరువు తగ్గినట్లు ఆయన వివరించారు. By Bhavana 14 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kejriwal Lost 8.5 kg: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay Singh) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుమారు 8.5 కిలోల బరువు తగ్గినట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా ఐదు సార్లు కేజ్రీవాల్ షుగర్ లెవల్ కూడా 50 కి పడిపోయినట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం ఇంతలా క్షీణించడం కూడా తీవ్ర అనారోగ్యానికి సంకేతమని ఆయన పేర్కొన్నారు. షుగర్ లెవెల్ ఆకస్మికంగా పడిపోవడం వల్ల కోమాలోకి కూడా వెళ్లవచ్చు. మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam) మనీలాండరింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రికి ఒకరోజు ముందు అంటే శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తరుణంలో సంజయ్ సింగ్ తరపున ఈ వాదన వినిపించింది. అయితే ఆయన బయటకు రాలేకపోయారు. ఎందుకంటే సంబంధిత కేసులో సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. జూన్ 26న కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. Also Read:నా మిత్రుడు ట్రంప్పై దాడిని ఖండిస్తున్నాను.. మోదీ ట్వీట్ #delhi-liquor-scam-case #arvind-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి