AP Murder: కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడి దారుణ హత్య!

కారుకు సైడ్ ఇవ్వలేదని సయ్యద్ అరీఫ్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది. చికిత్స పొందుతూ అరీఫ్ మృతి చెందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి!
New Update

Murder: ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణ మర్డర్ జరిగింది. చీరాల మండలం ఆదినారాయణపురం వద్ద సైకిల్ పై వెళ్తున్న ఓ యువకుడు కారుకు దారి ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మేరకు సయ్యద్ అరీఫ్ (18) అనే యువకుడు బైక్ మీద వస్తున్న తన స్నేహితుడు మనోజ్ తో మాట్లాడుకూంటూ సైకిల్ మీద వేళ్తున్నాడు. ఈ క్రమంలోనే వెనకాల కారులో వచ్చిన దుండగులు.. తమ కారుకు సైడ్ ఇవ్వలేదనే కోపంతో అరీఫ్ ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరీఫ్ మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

#syed-arif #young-boy-murder #bapatla-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe