• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » అనగనగా ఓ గ్రామం.. అభివృద్ధికి దూరం!

అనగనగా ఓ గ్రామం.. అభివృద్ధికి దూరం!

Published on June 21, 2023 9:12 am by Vijaya

ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం అభివృద్ధి దూరంగా ఉంటోంది. కనిగిరి నియోజకవర్గంలోని ఈ గ్రామంలో ఎవరూ సెల్ ఫోన్ వాడరు. పురాతన పాత పద్దతుల్నే వాడుతూ ఇక్కడివారి జీవనం కొనసాగుతుంటుంది. ఈ ఊరిపేరు తుంగూడు.

Translate this News:

 

A village of basic amenities

పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని ఈ గ్రామం మౌలిక సదుపాయాలకు దూరం అయిందనే చెప్పాలి. కనిగిరి నియోజకవర్గం సిఎస్ పురం మండలం తుంగూడు గ్రామ ప్రజల వారి జీవన విధానం వారు జీవిస్తున్న ప్రాంతం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. 35 కుటుంబాల నుంచి 40 కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవిస్తున్న ఆధునిక వసతులకు, సాంకేతిక పరిజ్ఞానాని వాసన చూడని వారిగా మిగిలిపోయారు. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా అభివృద్ధి చెందని గ్రామాలు ఉన్నాయని ఈ గ్రామాన్ని చూస్తే మనం కచ్చితంగా ఒప్పుకోక తప్పదు..

బస్సు సర్వీసులు లేవు

తుంగూడు గ్రామస్తులు వాస్తవానికి కనిగిరి నియోజకవర్గంలో జీవనం సాగిస్తున్న గిద్దలూరు నియోజకవర్గం వీరికి కూతవేటు దూరంలోనే ఉంది. బేస్తవారిపేట మండలం కొనపల్లె గ్రామం వీరికి చాలా దగ్గరగా ఉంది.వీరికి ఏ అవసరం వచ్చినా మొదట కంభం,బేస్తవారిపేట ప్రాంతాలకు వెళ్లి తమ అవసరాలను తీర్చుకుంటరు. వీరు సిఎస్ పురం గ్రామానికి వెళ్లేందుకు వీరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే. గతంలో వీరికి కంభం ప్రాంతం నుండి ఉదయం,సాయంత్రం ఓ ట్రిప్ ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. కరోనా మొదటి వే లాక్ డౌన్ సమయంలో ఉన్న ఒక్క బస్సు సర్వీసు నిలిపివేశారు.గతంలో ఉన్న ఆర్టిసి బస్సు సర్వీసు ద్వారా ఈ గ్రామస్తులు వారి పిల్లల విద్య, వైద్యం వారికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతూ ఉండేది ప్రస్తుతం ఆ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇక ఈ గ్రామస్తులకు వైద్య సహాయం అవసరమైతే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవలసిందే.అత్యవసర సమయంలో 108 వాహనానికి ఫోన్ చేయాలన్నా ఆరు కిలోమీటర్లు నడిచి బేస్తవారిపేట మండలం కొన పల్లె గ్రామ సమీపానికి వెళ్లి 108 వాహనానికి సమాచారం అందించాల్సిన పరిస్థితి.

అభివృద్ధి శూన్యం

ఇక సర్కారు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవాలన్న వీరు 4 నుంచి 6 కిలోమీటర్ల నడవ వలసిందే. ఈ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ కమ్యూనికేషన్ లేకపోవడంతో ఆ సౌకర్యం ఉన్న బేస్తవారిపేట ప్రాంతానికి వెళ్లి వేలి ముద్రలు వేసి రేషన్ పొందాల్సిందే.ఇలా ఈ గ్రామస్తులకు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మౌలిక సదుపాయాల కోసం దశాబ్దాలుగా ఆపసోపాలు పడుతూనే ఉన్నారు.ఇక ఈ గ్రామంలో ఇప్పటికీ చాలా మేరకు పూరి గుడిసెల దర్శనమిస్తాయి. గ్రామంలో ఐదో తరగతి వరకు చదువుకునేందుకు వెసులుబాటు ఉన్న ఆ పై చదువులు చదవాలి అంటే వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పదు.ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు తమ పిల్లల్ని అటు సిఎస్ పురం కానీ లేదా ఇటు బేస్తవారిపేట,కంభం కానీ పంపించవలసిందే అంటున్నారు ఆ గ్రామస్తులు, రోజు వెళ్లి వచ్చేందుకు వాహన సదుపాయం లేకపోవడంతో వారి పిల్లల్ని హాస్టల్స్ లో ఉంచి చదివిస్తున్నామంటున్నారు.వీరు గిద్దలూరు నియోజక వర్గానికి 50 కిలోమీటర్లు కనిగిరి నియోజకవర్గానికి 65 కిలోమీటర్లు దూరంలో జీవనం సాగిస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం కంభం, బేస్తవారిపేట ప్రాంతాలకు వెళ్లాలంటే 40 కిలోమీటర్లు దూరం ఉండగా సిఎ పురం గ్రామానికి వెళ్లేందుకు 40 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిందే.ఈ రెండు నియోజకవర్గాలకు చిట్ట చివర ఉండటం అందులో చుట్టూ కొండలు అటవీ ప్రాంతంలో ఉండటం మా గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని,మా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని తుంగూడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము కనిగిరి నియోజకవర్గం లోనే ఉన్నా మా మౌలిక సదుపాయాల కోసం గిద్దలూరు నియోజక వర్గం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటం అంటున్నారు.

ప్రభుత్వాలు గుర్తించాలి

సాంకేతిక పరిజ్ఞానం పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో ఎన్నో వింతలు, విశేషాలు చూస్తూనే ఉన్నాం.టెక్నాలజీలో ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నాం అని ఊదరగొడుతున్నారు ప్రభుత్వాలు ఇలాంటి గ్రామాలను చూసైనా ఇంకా వెనుకబడే ఉన్నామని ఆలోచిస్తారేమో.మౌలిక సదుపాయాలకు నోచుకోని ఇలాంటి గ్రామాలను అధికార ప్రభుత్వం గుర్తిస్తాయని, అభివృద్ధి చేస్తాయని ప్రతి ఒక్కరం ఆశిద్దాం.

Primary Sidebar

KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్

KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్

Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

waheeda, dada saheb award

movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం

lawrence met rajini

movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ

aleru mla sunitha

Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

niharika in USA

Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online