హైదరాబాద్‌లో విషాదం.. వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి

హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పెట్ బషీరాబాద్ లో వీధి కుక్కతో దాడిలో బాలిక మృతి చెందింది. నిన్న వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెండేళ్ల బాలిక దీపాళి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది.

Madhya Pradesh: పెంపుడు కుక్కలే ప్రాణం తీశాయా? ఆవేశం అదుపు తప్పిందా?
New Update

Dogs Attack On Two Year Old Girl: హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పెట్ బషీరాబాద్ లో వీధి కుక్కతో దాడిలో బాలిక మృతి చెందింది. నిన్న వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెండేళ్ల బాలిక దీపాళి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది. రెండేళ్ల కూతురు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమే అని అక్కడి స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో కుక్కల దాడిలో ఏడు నెలల చిన్నారి మృతి చెందింది.

#dog-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe