Khammam Student: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం!

అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి పై కత్తితో దాడి జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్‌ అనే యువకుని పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడం వల్ల ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Khammam Student: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం!

అమెరికాలో(America)  ఉన్నత చదువులు అభ్యసించడానికి వెళ్లిన తెలంగాణ (Telangana) విద్యార్థి పై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో విద్యార్థి తీవ్రంగా గాయాలపాలై..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడ అధికారులు తెలిపారు.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..తెలంగాణ ఖమ్మం జిల్లాకు మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్‌ రాజ్‌ (29) అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదవడానికి వెళ్లాడు. వరుణ్‌ ఎంఎస్‌ చేస్తూనే పార్ట్‌ టైం జాబ్‌ కూడా చేసుకుంటున్నాడు.

Also read: ఇద్దరు ప్రియులు.. బలైన మొగుడు.. భర్తను చంపి భలే స్టోరీ అల్లిందిగా!

ఈ క్రమంలోనే వరుణ్‌ మంగళవారం జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా..ఓ దుండగుడు కత్తితో అతని పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో వరుణ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పాటు అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. దాడి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వరుణ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అమెరికా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనుక గల ఉద్దేశ్యం, జాతి వివక్షతో దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

వరుణ్‌ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఆయన మంగళవారం రాత్రి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ ను కలిశారు. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు