Crime News : ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమికులు.. చివరికి ప్రియుడిని బంధించి..

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఓ గ్రామ శివారులోకి వెళ్లారు. గమనించిన హోంగార్డు వారిని డబ్బులు డిమాండు చేశాడు. వారు కొంత నగదు ఇచ్చాక.. ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Crime News : ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమికులు.. చివరికి ప్రియుడిని బంధించి..
New Update

Vizianagaram : ప్రియుడిని బంధించి ప్రియురాలిపై ఓ హోంగార్డు అత్యాచారానికి (Home Guard Rape) పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకొంది. దిశ ఎస్సై పి.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రేమికులు (Lovers) గురువారం ఏకాంతంగా గడిపేందుకు గ్రామ శివారులోకి వెళ్లారు. అటుగా వెళ్తున్న హోంగార్డు రాజ్‌కుమార్‌ వారిని చూశాడు. పోలీసు వాహనం (Police Vehicle) తో అక్కడికి వెళ్లి.. స్టేషన్‌కు రావాలని ప్రేమికులను బెదిరించాడు.

Also Read: చేతి బొటన వేలును కరుచుకుని వెళ్లిన కుక్క..!

వదిలేయాలని సదరు జంట వేడుకోవడంతో డబ్బులు డిమాండు చేశాడు. వారు కొంత నగదు ఇచ్చాక.. ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధితురాలు శుక్రవారం దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన రాజ్‌కుమార్‌ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ డీఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఘటన సమయంలో అతడి వెంట మరో వ్యక్తి ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

#lovers #vizianagaram #home-guard-rape
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి