Crime: అలా చేస్తున్నాడని బాయ్ ఫ్రెండ్ ను ఖతం చేసిన ప్రియురాలు!

సిమ్లాలో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ప్రేమించిన యువకుడిని ఘోరంగా హతమార్చింది. ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి మెడకు తాడు బిగించి హతం చేసింది. లైంగిక వేధింపులు కారణమని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి!

Murder: ప్రేమించిన యువకుడిపై ఓ ప్రియురాలు దారుణానికి పాల్పడింది. పెళ్లికిముందే శారీరక అవసరం తీర్చాలంటూ వేధిస్తున్నాడనే కారణంతో స్నేహితులతోకలిసి యువకుడిని హతం చేసింది. ఈ దారుణమైన ఘటన సిమ్లాలో చోటు చేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రేమలో ఉండగానే దారుణం..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పుట్సురా గ్రామానికి చెందిన 18 ఏళ్ల వీరేంద్ర యాదవ్, తన సోదరి పునితా యాదవ్‌తో కలిసి బలరాంపూర్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇందులో భాగంగానే వీరేంద్ర లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో అతన్ని హతమార్చేందుకు ప్లాన్ చేసింది. మరో ఇద్దరు మైనర్లతో కలిసి వీరేంద్రను చంపేందుకు పతకం వేసింది. రూమలో ఒంటిరిగా ఉన్నపుడు నమ్మించి స్నేహితులతో కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Errabelli: భూ ఆక్రమణలు, కిడ్నాప్ లు, ఫోన్ ట్యాపింగ్.. ఆర్టీవీతో ఎర్రబెల్లి దయాకర్ సంచలన ఇంటర్య్వూ!

లైంగిక వేధింపులే కారణం..
అయితే తీవ్రంగా గాయపడిన వీరేంద్ర స్నేహితులు చెల్లే పునీతాకు సమాచారం అందించారు. రూమ్‌లో అచేతనంగా పడి ఉన్న సోదరుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో సోదరుడు వీరేంద్ర మృతిపై సోదరి పునీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఈ విషం తెలుసుకున్న పోలీసులు షాక్‌ అయ్యారు. ఇద్దరు మైనర్‌ బాలికలను అరెస్ట్‌ చేశారు. లైంగిక సంబంధం కోసం వీరేంద్ర బలవంతం చేస్తుండటంతో స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి చంపినట్లు పోలీసులకు ఆ బాలిక చెప్పిందని పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు