జమ్మూ లోయలో ఉత్తరప్రదేశ్ బస్సు బోల్తా! జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన బస్సు అఖ్నూర్లోని తుంగి మోర్ వద్ద లోయలో పడింది.ఈ ఘటనలో 7 గురు మరణించగా 30 మందికి తీవ్ర గాయాలైయాయి. బస్సులో 6ం మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు సమాచారం. By Durga Rao 30 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Bus Falls Into Gorge In Jammu & Kashmir: జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్లోని తుంగి మోర్ ప్రాంతంలో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ప్రస్తుతం 7గురు మరణించగా, 30 మంది తీవ్ర గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ నంబర్కు చెందిన ఈ బస్సు జమ్మూ నుండి శివఖోడికి వెళ్తోంది. ఈ సమయంలో అఖ్నూర్లోని తుంగి మోర్ వద్ద లోతైన గుంటలో పడింది. బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. #jammu-kashmir #jammu-news #bus-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి